కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ఓట్లు అడిగితే చీపుర్లతో కొట్టాలి: మంత్రి మల్లారెడ్డి ఫైర్

by Disha Web Desk 19 |
కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ఓట్లు అడిగితే చీపుర్లతో కొట్టాలి: మంత్రి మల్లారెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి మల్లారెడ్డి మరోసారి రెచ్చిపోయారు. మంగళవారం నిజామాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మల్లారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ఓట్లు అడిగితే చీపుర్లతో కొట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఏం చేశారని.. ఏ ముఖం పెట్టుకుని అధికారంలోకి వస్తారని ప్రశ్నించారు. నిజామాబాద్‌లో అర్వింద్ ఎలా ఎంపీ అయ్యాడో.. మా దగ్గర రేవంత్‌రెడ్డి అలానే ఎంపీ అయ్యాడని సెటైర్లు వేశారు. రోడ్ల మీద తిరుగుతూ రేవంత్‌రెడ్డి అధికారంలో వస్తా అంటున్నాడని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు.

Also Read..

ఈటల రాజేందర్ ఫెయిల్.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ లీడర్లపై బీజేపీ అధిష్టానం సీరియస్!

ఎన్నికలకు ముందే గులాబీ బాస్ మాస్టర్ స్కెచ్.. టీకాంగ్రెస్‌కు షాక్ తప్పదా?

Next Story

Most Viewed